సంగారెడ్డి : జిల్లాలోని పటాన్చెరు నియోజవర్గంలోని భారతినగర్ డివిజన్ను బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ బృందం సందర్శించింది. ఎల్.ఐ. జి వార్డ్ ఆఫీస్లో ఇక్కడ ఆచరిస్తున్నా సంప్రదాయాలను, రుచులను, నిత్యం జరిగే పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
క్రిందటి వారం మేయర్ ఛాంబర్ లో బ్రిటిష్ హై కమీషనర్ బృందంతో మహిళ సాధికారత అంశం పై సమావేశం అయినప్పుడు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి డివిజన్ లో జరిగిన అభివృద్ధి పనులు ,మహిళ సంఘాల గురుంచి వివరించారు.
అభివృద్ధి పనులపై ఆకర్షితులై డివిజన్ను శుక్రవారం సందర్శించారు. వారు డివిజన్ లో పర్యటిస్తూ ఈశ్వరంభ మహిళా సొసైటీ వారు ఏర్పాటు చేసిన డిజైన్ డెవలప్మెంట్ వర్క్ షాప్ ను వీక్షించారు. అనంతరం ఎం.ఐ.జి లో జరుగుతున్న మహిళా భవన్ ను పరిశీలించారు.
బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. మహిళలకు సామాజిక భద్రత నేటి అవసరమన్నారు. రాజకీయాల్లోనూ ప్రాతినిధ్యం పెరగాలి అన్నారు.తనవంతు డివిజన్ కు సహకారం అందిస్తామని అన్నారు.