తూప్రాన్, ఏప్రిల్ 11 : మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో వేర్వేరు ఘటనలో 28.25 టన్నుల రేషన్ బియ్యాన్ని తూప్రాన్ పోలీసులు పట్టుకుని పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. తూప్రాన్ ఎస్సై శివానందం ఆధ్వర్యంలో గురువారం ఉదయం తూప్రాన్ మున్సిపల్ పరిధి అల్లాపూర్ టోల్ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా, హైదరాబాద్ నుంచి నాగ్పూర్ తరలిస్తున్న 28 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. లారీలో బియ్యం తరలిస్తున్న భాస్కర్రెడ్డి, చింటయ్య, డ్రైవర్ నీరజ్ కుమార్పై కేసు నమోదు చేశారు. మరో ఘటనలో 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం లోడుతో వెళ్తున్న ఆటోను పోలీసులు పట్టుకుని, ఆటో ఓనర్ తేజావత్ రవి, డ్రైవర్ బాలాజీపై కేసు నమోదు చేశారు. మొత్తం 28.25 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి పీడీఎస్ తూప్రాన్ ఇన్చార్జి డిప్యూటీ తహసీల్దార్ ప్రణీత సమక్షంలో పంచనామా నిర్వహించి పౌర సరఫరాల శాఖకు అప్పగించినట్లు ఎస్ఐ శివానందం తెలిపారు.