కొల్చారం, నవంబర్ 29 : కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని కొత్త మండలం ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ యువజన సంఘం, ఎమ్మెస్ఎఫ్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఈ మేరకు మంగళవారం సంగాయిపేట గుండా రంగంపేట పరిసర గ్రామాల మీదుగా మంగళవారం శాంతియుత పాదయాత్ర చేపట్టారు.
సంగాయిపేటలోని అంబేద్కర్, శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి, పాదయాత్రను ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే పాదయాత్ర మొదటి రోజు రంగంపేట, దుంపలకుంట చౌరస్తా, ఎనగండ్ల, ఏటిగడ్డమాందాపూర్, కోనాపూర్ మీదుగా పైతర గ్రామం వరకు నిర్వహిస్తు న్నట్లు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. పాదయాత్రకు సమీప గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మండల ఏర్పా టు ఆవశ్యకతపై వివరిస్తూ పాదయాత్ర ముందుకు సాగింది. ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్ర ప్రభాకర్ మాట్లాడుతూ..
పాదయాత్ర ఎవరికి వ్యతిరేకం కాదని, రంగంపేట మండల ఏర్పాటుకు ఎమ్మెల్యే మదన్రెడ్డి మద్దతు ఇస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నామన్నారు. మంత్రి హరీశ్రావు ద్వారా విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రంగంపేటను మం డలాన్ని ప్రకటించాలని కోరారు. పాదయాత్రలో ఎమ్మెఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు మహేశ్, అంబేద్కర్ యువజన సం ఘం నాయకులు దుర్గయ్య, మరెల్లి అనిల్, ఎమ్మార్పీఎస్ నా యకులు మహేశ్, ముర్షిత్, కిష్టయ్య, బాల్రాజు, దుర్గయ్య, శ్రీకాంత్, జాన్, యాదయ్య, సిద్ధిరాములు, ఎనగండ్ల ఉపసర్పంచ్ బాబుతోపాటు ఇతర సంఘాల నేతలు పాల్గొన్నారు.
రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలి
రామాయంపేట, నవంబర్ 29 : రామాయంపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్గా చేయాలని అఖిలపక్షం అధ్వర్యం లో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎండీ మన్నన్ను వినతిపత్రం అందజేశారు. మం గళవారం వివిధ పార్టీల నాయకులతోపాటు పట్టణప్రజలు రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా చేయాలని తహసీసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, బీజేపీ నాయకులు శంకర్గౌడ్, పోచమ్మల అశ్విని, రమేశ్రెడ్డి, అల్లాడి వెంకటేశం, శ్రీనువాస్, శివ, దయానందరెడ్డి, బైరం కుమార్, చింతల శేఖర్, కౌన్సిలర్లు అనిల్, సుందర్సింగ్, చింతల యాదగిరి, సురేశ్ నాయక్, మర్కు దత్తు, మసాయిపేట మల్లేశం పాల్గొన్నారు.