రాయికోడ్,ఫిబ్రవరి18: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధిక మెజారిటీతో భార్య రాధ తుకారామ్ కురుమను రాయికోడ్ సర్పంచ్గా గెలిపించిన తుకారామ్ కురుమకు అభినందనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్లో మాజీ మంత్రి హరీశ్రావును బుధవారం బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా మాజీ మం త్రి హరీశ్రావు మాట్లాడుతూ… అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సహాయ సహకారంతో మున్ముందు రాయికోడ్ మండలంలో బీఆర్ఎస్ గెలుపుకోసం పనిచేయాలన్నారు.
మండలంలో గెలిచిన సర్పంచ్లతో కలిసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. మండలంలో పార్టీని బలోపేతం చేయాలని ఆయన తుకారామ్కు సూచించారు. రాయికోడ్ గ్రామ పంచాయతీని జిల్లాలోనే ముందువరుసలో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకుడు ఎం.సంగమేశ్వర్ ఉన్నారు.