రాయపోల్, జనవరి 20 : మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని ఇందూప్రియాల్లో శనివారం పలు కమ్యూనిటీ భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం అసంపూర్తిగా ఉన్న కాల్వలను పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్,కొండపోచమ్మ ప్రాజెక్టుల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని లక్షా 33 వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎంపీపీ సంధ్యారవీందర్, జడ్పీటీసీ రణం జ్యోతి, వైస్ ఎంపీపీ అల్లి శేఖర్రెడ్డి, ఉమ్మడి మండల సొసైటీ చైర్మన్ వెంకట్రెడ్డి, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడు రహీమొద్దీన్, సర్పంచ్లు శ్యామలాకుమార్, స్వప్నాజనార్దన్రెడ్డి, అయ్యగారి నర్సింహులు, తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు.