నిజాంపేట,జనవరి 27 : గ్రామంలో మద్యం అమ్మకాలను పూర్తి గా నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి కల్వకుంట గ్రామస్తులు ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. కల్వకుంటలో శుక్రవారం గ్రామపంచా యతీ కార్యాలయ ఆవరణలో గ్రామసభ నిర్వహిం చి, మద్యం అమ్మకాలు నిషేధించాలని గ్రామస్తు లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణవేణి మాట్లాడుతూ గ్రామంలో సం పూర్ణ మద్యపాన నిషేధం సాధించడానికి ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు. తీర్మానానికి విరుద్దంగా గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామన్నారు. గ్రామంలో మద్యం విక్రయాలు నిషేధించాలని ఇటీవల స్థానిక యువజన సంఘం సభ్యులు ర్యాలీ నిర్వహించారు. వీరికి సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మద్యం నిషేధంపై గ్రామస్తులు చేసిన తీర్మానాన్ని రామాయంపేట సీఐ చంద్రశేఖర్, ఎక్సైజ్శాఖ నిజాంపేట ఏఎస్సై ప్రతాప్తోపాటు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, కలెక్టర్కు అందజేశామని సర్పం చ్ కృష్ణవేణి వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, ఉప సర్పంచ్ పద్మలత, వార్డు సభ్యులు రాజేశ్, శివరాములు, భూదయ్య, భూపాల్, గ్రామస్తులు బాలమలయ్య, మురళి, మధుసూదన్, లక్ష్మణ్, కిష్టయ్య తదితరులు ఉన్నారు.