క్షణాల్లో డిజిటల్ సేవలు
పోస్ట్ ఇన్ఫోయాప్తో మరిన్ని సదుపాయాలు
కొమురవెల్లి, జూన్ 20 : తపాలశాఖ ఉందనే విష యం ఈ కాలంలో చాలా మందికి తెలియనే తెలియదు. కేవ లం ఉత్తరాలు, బట్వాడా లాంటి సేవలకే మరిమితమైతే మనుగడ కష్టమని గ్రహించిన తపాల శాఖ పూర్వకాలం నాటి పద్ధతులకు స్వస్తి పలుకుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీతో వినియోగదారులకు సేవలు అందంచడానికి ప్రయత్నం చేస్తుంది. మార్కెట్లోకి వచ్చిన ప్రతి సేవలను తాము అందిస్తామని సగర్వంగా ప్రచారం చేస్తుంది. ఆధార్ కార్డు నమో దు, సవరణలు, పాస్పోర్టు దరఖాస్తు తదితర ఎన్నో సేవలు అందిస్తూ వినియోగదారులకు చేరువ అవుతున్నది. సుకన్య సమృద్ధి యోజన, సేవింగ్స్ డిపాజిట్ల సేకరణలో కూడా వినూత్న పంథా అనుసరిస్తుంది. ఒక్కో మాటలో చెప్పాలంటే అన్నింటా తాను ఉన్నానని చాటి చెబుతుంది.
ఇతర సేవా సంస్థలకు దీటుగా పోస్ట్ ఇన్ఫోమొబైల్ యాప్
త్వరితగతిన సమాచారం కోసం ఇప్పుడు ప్రజలంతా మొబైల్ఫోన్ల మీదనే ఆధారపడుతున్నారు. అన్ని రకాల సేవలు ఫోన్ ద్వారా సులభంగా పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తపాలాశాఖ పోస్ట్ ఇన్ఫోమొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బ్యాంకులు, సేవలందించే ఇతర సంస్థలకు దీటుగా ఈయాప్ చక్కగా ఉపయోగపడుతుంది. అండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్టోర్ నుంచి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పోస్ట్ ఇన్ఫోయాప్తో ఎన్నో ఉపయోగాలు
తపాలా శాఖ ప్రవేశపెట్టిన పొస్ట్ ఇన్ఫోయాప్తో తొమ్మిది రకాల సేవలు అందుతున్నాయి. వినియోగదారులకు ఈయాప్ ద్వారా మరిన్ని సేవలు అందించే విధంగా తపాలాశాఖ మార్పులు చేస్తుంది. తపాలా వినియోగదారులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని 9 రకాల తపాలా సేవలు సులభంగా మీ మొబైల్ ద్వారా పొందవచ్చు. – సబ్బని రఘు సబ్ పోస్ట్మాస్టర్, మర్రిముచ్చాల