సిద్దిపేట, మార్చి 2: అప్పుడే పుట్టిన పాప నుంచి ఐదేండ్లలోపు చిన్నారుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో చుకల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం(నేడు) జిల్లాలో పల్స్ పోలియో చుకల పంపిణీకి వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పోలియో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచారు.
సిద్దిపేట జిల్లాలో 82,075 మంది చిన్నారులకు పోలియో వ్యాక్సిన్ వేయనున్నారు. జిల్లాలో 2,96,352 ఆవాస ప్రాంతాల్లో 0-5 ఏండ్లలోపు 93,667 మంది చిన్నారులు ఉన్నారు. వీరందిరికీ పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం జిల్లాలో 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 194 ఉప కేంద్రాల పరిధిలో 586 బూత్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో 306 హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించారు. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ్ద వహించి 100% పిల్లలకు పోలియో చుకలు వేసేందుకు 37 మొబైల్ టీమ్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు బస్టాండ్లు,మారెట్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో 21 ట్రాన్సిట్ బూత్లు ఏర్పాటు చేశారు. సిద్దిపేట బస్టాండ్-2, రైల్వేస్టేషన్-1, జగదేవ్పూర్-1, రాయపోల్ -1, సింగన్నగూడెం-1 గజ్వేల్-3, తీగుల్ -1,వర్గల్ -2,కోహెడ-1, హుస్నాబాద్ -2,చేర్యాల పట్టణం-2, దుబ్బాక పట్టణం-1, కొమరవెల్లి జాతర ప్రాంతాల్లో-3, మొత్తం 21 ట్రాన్సిట్ బూత్లు ఏర్పాటు చేశారు. 57 మంది సూపర్వైజర్లు, 2453 మంది వ్యాక్సినేటర్లు సేవలు అందిస్తారు. వ్యాక్సిన్ నిల్వ చేయడానికి విద్యుత్ శాఖ అధికారులు ఈనెల 5వ తేదీ వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పవర్ కటింగ్స్ లేకుండా చూడాలని ఆదనపు కలెక్టర్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. బస్టాండ్లలో పల్స్ పోలియో కార్యక్రమంపై రవాణా శాఖ అధికారులు ప్రతి పది నిమిషాలకు ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తారు. పోలియో కేంద్రాల్లో చుక్కలు వేసిన మరుసటి రోజు ఇంటింటికీ తిరిగి చుక్కలు వేయించుకోని పిల్లలకు ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది వెళ్లి వేస్తారు.
మెదక్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : ఈనెల 3, 4, 5 తేదీల్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా వైద్యాధికారి చందునాయక్ కోరారు. జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 157 ఆరోగ్య ఉప కేంద్రాలు,1,74,534 నివాస ఇండ్లు, 20 ట్రాన్సిట్ పాయింట్లు, 176 హైరిస్ కేంద్రాల్లో మొత్తం 457 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 1046 టీమ్ల ద్వారా, 46 రూట్లలో 1828 వ్యాక్సినేటర్లతో జిల్లాలో 75433 మంది చిన్నారులకు పోలియో చుకలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆదివారం (నేడు)కేంద్రాల్లో, 4,5 తేదీల్లో మిగిలిపోయిన పిల్లలకు ఇంటింటికీ వెళ్లి సిబ్బంది పోలియో చుకలు వేస్తారని జిల్లా వైద్యాధికారి తెలిపారు.
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా 0-5 ఏండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. జిల్లాలో 194 ఉప కేంద్రాల పరిధిలో 586 బూత్లు ఏర్పాటు చేశాం. 2453 మంది సిబ్బందిని నియమించారు. తల్లిదండ్రులు, కుటుంబీకులు తమ చిన్నారులకు తప్పక పోలియో చుక్కల మందు వేయించాలి.