రామాయంపేట/ నిజాంపేట, ఆగస్ట్టు 1 : దశాబ్దాల కాలం గా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సాయం లేక విలవిలలాడుతున్న బీడీ టేకేదారుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. ఇకపై బీడీ కార్మికులు ఇస్తున్న విధంగానే టేకేదారు లకు ప్రతినెలా పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో బీడీ కార్ఖానాలు నడిపిస్తున్న టేకేదారులకు కూడా మహిళలకు ఇస్తున్న మాదిరిగానే ప్రతినెల రూ.2116 పింఛన్ ఇస్తామని మంత్రివర్గం తీర్మానం చేయడంతోపాటు మంత్రి కేటీఆర్ ప్రకటించడంలో టేకేదారులు హర్షం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లావ్యాప్తంగా టేకేదారులు సంబురాలు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. జిల్లాలో మొత్తం బీడీ పరిశ్రమల్లో 266 మంది టేకేదారులు కమీషన్ ఏజంట్గా కార్ఖానాలను నడిపిస్తున్నారు. టేకేదారులకు బీడీ పరిశ్రమ ఉపాధిగా మారింది. ఇటీవల టేకేదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం వారి ఇబ్బందులను గుర్తించి పింఛన్ ఇస్తామని ప్రకటించింది.
నిజాంపేట మండలకేంద్రంలో టేకేదారులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.కార్యక్రమం లో ఉపసర్పంచ్ బాబు, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నాగరాజు, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు మావురం రాజు, సోషల్ మీడి యా మండలాధ్యక్షుడు అబ్దుల్ఆజీజ్, రామాయంపేట ఏఎం సీ డైరెక్టర్ వెంకటేశం, నేతలు సిద్ధిరాంరెడ్డి, లక్ష్మణ్, స్వామి, టేకేదారులు రాములు, శ్రీశైలం, అనిల్, శంకరయ్య, నరేందర్, రాజు, అమర్, కుమార్, స్వామి, తిరుపతి ఉన్నారు.
కేసీఆర్ సార్ను జీవితంలో మరచిపోం
మా కష్టాలను తీర్చిన సీఎం కేసీఆర్ సార్ను జీవితంలో మరిచిపోలేం. మంత్రివర్గ సమావేశంలో టేకేదారులకు కూడా ఆసరా పింఛన్ ఇస్తానని ప్రకటించడం హ ర్షణీయం. బీడీ కార్ఖానాలను కమీషన్పై నడిపిస్తున్నాం. పెరిగిన ధరల నేపథ్యంలో పరిశ్రమలు ఇస్తున్న కమీషన్ గిట్టుబాటు కావడం లేదు. మ మ్మల్ని ఆదుకోవడానికి పింఛన్ ఇస్తానని మాటిచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు జీవితకాలం రుణపడి ఉంటాం.
– అంబటి లక్ష్మణ్, నందిగామ
మళ్లీ కేసీఆర్నే గెలిపించుకుంటాం
మాకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న సీఎం కేసీఆర్ సార్నే మళ్లీ గెలిపించుకుంటాం. 20 ఏండ్లుగా బీడీ కార్ఖానాలు నడిపిస్తున్నాం. బీడీ పరిశ్రమ తీవ్ర ఆర్థిక ఇబ్బందు ల్లో ఉండడంతో మాకు గిట్టుబాటు కావడం లేదు. మరో పని రాక పోవడంతో కష్టాలు ఉన్నా ఇదే పనిని చేస్తున్నాం. మేము అనుకోకుండానే దేవుడిలా సీఎం సార్ పెన్షన్ ఇస్తానని చెప్పిండు. మేము కేసీఆర్ సార్నే సీఎంగా చేస్తాం.
– దేవసాని రామచంద్రం, కోనాపూర్, రామాయంపేట
వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్
బీడీ కార్మికులు చేసిన బీడీలను రోజువారీగా లెక్కబెట్టే క్రమంలో తంబాకు వాసనను కొన్నేండ్ల నుంచి పీల్చుకుంటూ అవస్థ పడుతున్నాను. గత ప్రభుత్వాలు టేకేదారులను పట్టించుకోలేదు. బీడీ కార్మికుల ఇస్తున్నట్లుగానే మాకు పింఛన్ ఇస్తామని సీఎం కేసీఆర్ సార్ ప్రకటించడం మాకు సంతోషాన్ని ఇచ్చింది. పొగచూరిన మా బతుకుల్లో పింఛన్తో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్ సార్.
– శ్రీశైలం, దేశాయ్బ్రదర్ బీడీ కంపెనీ, నిజాంపేట
బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు
కమీషన్దారులకు పెన్షన్ ఇస్తానంటున్న బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తం. వేయడమే కాకుండా కార్మి కులతో సైతం ఓట్లు వేయిస్తాం. ఇది కేసీఆర్ సార్ మాపై పెట్టిన బాధ్యత. ఇన్నేండ్లుగా బీడీ కార్ఖానా నడిపిస్తున్నా ఏ పార్టీ కూడా బీడీ కార్మికులను, టేకే దారులను గుర్తించలేదు. పెన్షన్ ఇస్తుండడంతో సీఎం కేసీఆర్ దయతో మా బతుకులకు దారి దొరికింది.
– లచ్చపేట రామాగౌడ్, నిజాంపేట
కేసీఆర్ సారే మాకు నిజమైన దేవుడు
ముప్పై ఏండ్లుగా బీడీ కార్ఖానాను నడిపిస్తున్నా. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు మమ్మల్ని పట్టించుకోలేదు. మా బాధలను అర్థం చేసుకున్నది ఒక్క కేసీఆర్సారే. మా బాధలు తీర్చిన కేసీఆర్ను మళ్లీ గెలిపించుకుంటాం. ప్రజా ప్రభుత్వాన్ని మళ్లీ కాపాడుకుంటాం.
– మెట్టు శంకరయ్య, నస్కల్,