మెదక్, ఫిబ్రవరి 9 : గత ఏడాది నవంబర్ 2న మెదక్ జిల్లా సరిహద్దులోని కాళ్లకల్ వద్ద ఆల్ఫాజోమ్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద రూ.26లక్షల 55వేలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎంఎ రజాక్ తెలిపారు. బుధవారం అతనిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించామన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన రూప్సింగ్ ఎంపీ09 డబ్ల్యుహెచ్ 7749 నంబర్ గల కారులో మూడు కిలోల ఆల్ఫాజోమ్ను గత ఏడాది నవంబర్ 2న కాళ్లకల్ ప్రాంతంలో విక్రయిస్తుండగా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
రామాయంపేట, ఫిబ్రవరి 9: విద్యార్థులు చెడు వ్యసనాలు, మ త్తు పదార్ధాలకు బానిసలు కాకుండా మంచి చదువులు చదివి కళాశాలకు పేరు తీసుకురావాలని రామాయంపేట ఎక్సై జ్ సీఐ జయసుధ పేర్కొన్నారు. బుధవారం రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గంజాయి, మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సిద్ధిరాంరెడ్డి, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, కళాశాల లెక్చరర్లు ఉన్నారు.