అమీన్పూర్, డిసెంబర్ 21: ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట్ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాలలో మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.1.10కోట్లతో నిధులతో పనులు ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 55 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, సర్పంచ్లు ఎర్పుల కృష్ణ, మల్లేశ్, నాయకులు సత్యనారాయణ, జానకంపేట్ మల్లేశ్, గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మండలంలోని కిష్టారెడ్డిపేట్, పటేల్గూడలో దేవాలయాల అభివృద్ధికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి శంకుస్థాపనలు చేశారు. కిష్టారెడ్డిపేట్లో మల్లికార్జున స్వామి దేవాలయం జీర్ణోద్ధారణ పనులను ఆయన ప్రారంభించారు. పటేల్ గూడ పరిదిలోని హరివిల్లు టౌన్షిప్లో హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయాల నిర్మాణాలకు శాయశక్తులా కృషిచేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు.