పటాన్చెరు, జనవరి 2 : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ను రాష్ట్రంలోనే ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చె రు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్ విజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మె ల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14ఎకరాల సువిశాల మార్కెట్ స్థలం ఉండటం అన్ని రకాలుగా కలిసివచ్చే అంశం అన్నారు. త్వరలోనే పటాన్చెరు మార్కెట్కు చక్కటి డిమాండ్ రాబోతుందన్నారు. ఇటీవల రూ. 23కోట్లతో 160 దుకాణాలు నిర్మించేందుకు శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. రైతులకు మెరుగైన వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలో పలు రకాలు హోల్సేల్ వ్యాపారాలు ప్రారంభించేలా కార్యాచరణ అమలు చేస్తామన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ మల్లారెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ప్రజాపాలనలో పాల్గొన్న ఎమ్మెల్యే
అమీన్పూర్ మున్సిపల్లోని 9,10,20 వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, కమిషనర్ జ్యోతిరెడ్డి, కౌన్సిలర్లు బోయిని బాలమణిబాలరాజు, కొల్లూరు మల్లేశ్, అనిరుధ్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి, చౌటకూరి మహిపాల్రెడ్డి, సురేందర్రెడ్డి, మల్లేశ్, కొండా లక్ష్మణ్, అనిల్, జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.