అల్లాదుర్గం, మార్చి 26: పంచాయతీ కార్యాలయంలో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్లాదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబీకులు, ఎస్ఐ ప్రవీణ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాదుర్గం గ్రామానికి చెందిన బోయిని కుమార్(28) కొన్నేండ్లుగా అల్లాదుర్గం పంచాయతీ కార్యాలయంలో తాత్కాలికంగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతడికి సకాలంలో వేతనాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి.
దీంతోఈ నెల 21న అర్ధరాత్రి తన నివాసంలో క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలో చేరాడు. దీంతో కుటుంబ సభ్యులు జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి దవాఖానకు, అటునుంచి హైదరాబాద్ ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి సోదరుడు బోయిని పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.