పాపన్నపేట, మార్చి 24 : ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో ఆదివారం రాత్రి పౌర్ణమి పురస్కరించుకుని పల్లకీసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహించి పల్లకీలో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్రెడ్డి, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
పలువురు భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం పోశారు. కుంకుమార్చనలు నిర్వహించారు. తలనీలాలు, బోనాలు సమర్పించారు. ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్రెడ్డి, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, రవివీర్కుమార్, ప్రతాప్ రెడ్డి, తోట నరసింహులు, వరుణాచారి, భత్తిని రాజు, శ్రీకాంత్ సేవలందించారు. వేద పండితులు శంకరశర్మ, పార్థివశర్మ, మురళీధర్, రాజశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాపన్నపేట ఎస్సై నరేశ్, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.