చేర్యాల, జనవరి 18: కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం సమీపంలో రైల్వే హాల్టింగ్ స్టేషన్ మంజూరు చేస్తూ రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్ పనులు ప్రారంభించినప్పటి నుంచి కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని అధికార, ప్రతిపక్ష నాయకులు కోరుతున్నారు. దీనిపై స్పందించిన రైల్వే బోర్డు ఉన్నతాధికారులు రైల్వే హాల్టింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.