మెదక్ మున్సిపాలిటీ, మే 9: ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ల్లో విలువైన సామగ్రి రక్షణకు కాపలాదారుల నియామకానికి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను తెరిచే వరకూ వీరు విధుల్లో ఉంటారు. వీరికి మన ఊరు – మన బడి నిర్వహణ నిధుల నుంచి నెలకు రూ.5 వేల పారితోషికం చెల్లిస్తారు. అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల లోపు వయసు కలిగిన వ్యక్తిని లేదా మాజీ సైనికుడిని కాపలాదారుగా ఎంపిక చేసుకోవాలని విద్యా కమిటీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాత్కాలిక ప్రాతిపదికన పని చేసే వారు రేయంబవళ్లు బడులకు కాపలాగా ఉంటారు. పాఠశాలలు పునఃప్రారంభించిన తర్వాత ప్రధానోపాధ్యా యులకు అప్పగించి వెళ్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రభుత్వం 124 మంది కాపలదారుల ను మంజూరు చేసింది. ఇందులో 62 ప్రాథ మిక, 14 ప్రాథమికోన్నత, 48 ఉన్నత పాఠ శాలల్లో నియామకం చేపట్టనున్నారు.