బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్లో సోమవారం నిర్వహించిన సమావేశానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి హాజరయ్యారు. నారాయణఖేడ్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, ఝరాసంఘంలో ఎమ్మెల్యే మాణిక్రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, నేడు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశ ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. కేంద్రం ప్రకటించిన ఉత్తమ పంచాయతీల్లో తెలంగాణ పల్లెలు సత్తాచాటాయని గుర్తుచేశారు. ఇక్కడ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రం కొర్రీలు పెడితే, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేని బీజేపీ, కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు సాధించేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాడవాడకు, గడపగడపకూ వెళ్లి అభివృద్ధిని వివరించాలని సూచించారు. అంతకుముందు సమ్మేళనాలకు హాజరైన ఎమ్మెల్యేలకు బ్యాండ్ మేళాలు, పటాకులు కాల్చి, పూలు చల్లి, భారీ ర్యాలీలతో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
– నారాయణఖేడ్/ జహీరాబాద్/ హత్నూర , ఏప్రిల్ 10
హత్నూర, ఏప్రిల్ 10 : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఇది జీర్ణించుకోలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీకి తగిన బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. హత్నూర మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం దౌల్తాబాద్ శివారులోని ఎస్ఎస్ఆర్ ఫంక్షన్హాల్లో సోమవారం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డితో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసి రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగంలో నిలిపితే, జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు తప్పుడు కూతలు కూస్తున్నాయని ఆరోపించారు. సమైక్యాంధ్ర పాలనలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు కోల్పోయి తెలంగాణ ప్రజలు అనేక కష్టాల పడితే, నేడు ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణ వస్తే రాష్ట్రం ఎడారిగా మారుతుందన్న ప్రతిపక్షాలకు నేడు కాళేశ్వరం జలాలతో బీడుభూములను పంటపొలాలుగా మార్చి సీఎం కేసీఆర్ గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం కొర్రీలు పెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి సకాలంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నదని, ఆ ఘనత కేవలం బీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలుచేస్తుండటంతో ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు తెలంగాణ పథకాలను కాపీకొడుతున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డుల్లో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచిందని, పది అవార్డులు కైవసం చేసుకోవడం తెలంగాణ పల్లెలు సాధించిన అభివృద్ధికి నిదర్శనమన్నారు. నేడు ప్రభుత్వ ఫలాలు పల్లెపల్లెకు, గడపగడపకూ చేరుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తున్న స్పందన చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని, సమయం వచ్చినప్పుడు ప్రతిపక్షాలకు బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి మరింత ఆదరణ పెరిగేలా కృషి చేయాలన్నారు. కేవలం నర్సాపూర్ నియోజకవర్గంలోనే మంజీరా నదిపై 14చెక్డ్యాంలు నిర్మించి వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది విజయదుందుబి మోగించనుందన్నారు. కేవలం రాష్ట్రం అభివృద్ధి చెందితే సరిపోదని దేశరాజకీయాల్లోనూ క్రియశీలకంగా మారాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ర్టాలకు విస్తరిస్తున్నారని, దేశంలో 50 ఎంపీ సీట్లు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
గడపగడపకూ ప్రభుత్వ ఫలాలు : మంజుశ్రీజైపాల్రెడ్డి, సంగారెడ్డి జిల్లా జడ్పీచైర్పర్సన్
రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న ప్రభుత్వ పథకాలు గడపగడపకూ చేరుతున్నాయని సంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పాటుకాకముందు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీటిని తెచ్చుకు న్న మహిళలు నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటిముంగిటే నల్లా నుంచి పుష్కలంగా నీటిని పట్టుకుంటున్నారని గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కంటివెలుగు, రైతుబంధు, రైతుబీమా, డబుల్బెడ్రూమ్ ఇండ్లు తదితర పథకాల ద్వారా అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందేలా ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ : ఉమ్మన్నగారి దేవేందర్రెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్
ప్రత్యేక రాష్ట్రం కోసం పద్నాలుగేండ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో ముందుంచారని తెలిపారు. తొమ్మిదేండ్లుగా లేని పేపర్ లీకేజీలు ఈసారి ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం బీజేపీ ఆడుతున్న నాటకమన్నారు. బీజేపీ,కాంగ్రెస్ నాయకులు బండిసంజయ్, రేవంత్రెడ్డిలు తమస్థాయిని మరిచి ఆరోపణలు చేస్తున్నారని, త్వరలోనే ప్రజలు తగిన గుణపాటం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల నాటికి పార్టీని ఎదురులేని శక్తిగా మార్చాలని కోరారు.
భారీగా తరలివచ్చిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు
దౌల్తాబాద్ ఆత్మీయ సమ్మేళనానికి హత్నూర మండలంలోని ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు భారీసంఖ్యలో తరలివచ్చారు. కాసాల చౌరస్తా నుంచి దౌల్తాబాద్ ఎస్ఎస్ఆర్ ఫంక్షన్హాల్ వరకు డీజే పాటలు, డప్పుచప్పుళ్లు, బ్యాండుమేళాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డిలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో వస్తూ ప్రజలకు అభివాదం చేశారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ, హత్నూర జడ్పీటీసీ ఆంజనేయులు, ఎంపీపీ నర్సింహులు, బీఆర్ఎస్కేవి జిల్లా అధ్యక్షుడు శివశంకర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, యువత అధ్యక్షుడు కిశోర్, నాయకులు దుర్గారెడ్డి, బుచ్చిరెడ్డి, రమేశ్నాయక్, దామోదర్రెడ్డి, వీరస్వామిగౌడ్, విఠల్రెడ్డి, సతీశ్, నవీన్గౌడ్, నరేందర్, సుధాకర్, అర్జున్, రాంరెడ్డి, వెంకటేశంగుప్త, రవి, మల్లేశం, రాజు, శ్రీశైలం, రవీందర్ నాయక్, పోచయ్య, వీరేశం, భాస్కర్గౌడ్, కిషన్రావు, యాదగిరి, పోచయ్య, అజ్మత్అలీ, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.