చిలిపిచెడ్/రామాయంపేట/నిజాంపేట/కొల్చారం/చిన్నశంకరంపేట/పాపన్నపేట/మెదక్ రూరల్, అక్టోబర్ 18: మండలంలోని చిట్కుల్ గ్రామ శివారు మంజీరానది తీరాన వెలిసిన చాముండేశ్వరి ఆలయంలో బుధవారం నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరిగాయి. నవరాత్రి ఉత్సవా ల్లో భాగంగా అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనంమిస్తున్నారు. మంజీరా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు ప్రభాకర్శర్మ ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు. అలయ ఆవరణలో భక్తులు కొత్త వాహనాలకు పూజలు చేయించుకున్నారు. ఉత్సవాలకు భక్తు లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నా రు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో నిర్వహించారు.
రామాయంపేట పట్టణంలోని మహంకాళి ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా పూలతో భక్తులు అలంకరించారు. బుధవారం అమ్మవారి సన్నిధిలో ఆలయ కమిటీ చైర్మ న్ దంపతులు పాండురంగాచారి-వరలక్ష్మిలు పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ సన్నిధిలో అమ్మవారికి మంగళహారతులు, నైవేద్యాలను సమర్పించి పూజలు చేశారు. పట్టణంలోని దుర్గాదేవి అమ్మవారి వద్ద 12వ వార్డు కౌన్సిలర్ సౌభాగ్య-శ్యాంసుందర్చారి దంపతులతోపాటు యువకులు అమ్మవారిని మహాలక్ష్మి దేవతగా అలకరించి, ప్రత్యేక పూజ లు చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజుయాదవ్, చింతల రాములు, మర్కు దత్తు, ఆలయ పూజారి నాగరాజుచారి, సిబ్బంది పాల్గొన్నారు.
నిజాంపేట మండల వ్యాప్తంగా దుర్గమాత దేవీ శరన్నవరాత్రోత్సవాలు కనుల విందుగా కొనసాగుతున్నాయి. బుధవారం నస్కల్లో కౌండన్య యూత్ సభ్యులు ప్రతిష్ఠించిన దుర్గమాత అమ్మవారికి నదుల జలాలతో అభిషేకం నిర్వహించారు. అంతకుముందు యూత్ సభ్యులు, గ్రామస్తులు ఆయా నదుల నుంచి సేకరించిన జలాలు స్థానిక రేణుక ఎల మ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి జలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కౌండన్య యూత్ సభ్యులు ప్రభాకర్గౌడ్, నరేందర్గౌడ్, వంశీగౌడ్, భాస్కర్గౌడ్ తదితరులు ఉన్నారు.
కొల్చారం మండల వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తున్నారు. పలు గ్రామాలలోని ప్రధాన కూడళ్లు, దేవాలయ ఆవరణలో దుర్గామాత ఉత్సవ విగ్రహాలను అందంగా తీర్చిదిద్దిన మండపాలలో ఏర్పాటు చేశారు. ఈమేరకు బుధవారం పోతంశెట్పల్లిలో బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు పూజలు చేశారు. చిన్నాఘన్పూర్లో దుర్గామాత వద్ద బీఆర్ఎస్ నాయకులు సోమ నర్సింహులు, నాగం రమేశ్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
చిన్నశంకరంపేటతో పాటు మండలంలోని వివిధ గ్రామా ల్లో బుధవారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి మండపాల వద్ద అమ్మవారికి ఒడి బియ్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
విజయదశమి నవరాత్రి ఉత్సవాలను పుర్కరించుకుని బుధవారం మెదక్ మండలంలోని మాచవరంలో దుర్గమాత అమ్మవారిని ధనలక్ష్మీ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
పాపన్నపేట మండలంలోని కొడుపాకలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విగ్రహ దాత పాపన్నపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పల శివశంకర్-సంతోషి దంపతులు బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.