శివ్వంపేట, జనవరి 22 : మండలంలోని సికింద్లాపూర్ గ్రామపరిధిలో ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు ఆదివారం కనులపండువగా ప్రారంభమయ్యా యి. ఉత్సవాలకు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి హాజరై ప్రభుత్వం తరుపున లక్ష్మీనరసింహస్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. బీఆర్ఎస్ సర్కార్ ఆలయాలకు పూర్వవైభవం తీసుకురావడానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. జాతరలో ఏర్పాట్లు బాగున్నాయని, ఎవరికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆలమ ఈవో శశిధర్ గుప్తాకు సూచించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
తిమ్మాపూర్లో బంగారమ్మ విగ్రహప్రతిష్ఠాపనోత్సవం..
శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో బంగారమ్మ ఆలయాన్ని నిర్వహించారు. నూతనంగా ఆలయం నిర్మించడంతో మూడురోజుల పాటు విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు జరుగనున్నాయి. మొదటిరోజు బంగారమ్మతల్లికి ఎదుర్కోలు నిర్వహించారు. పూజల్లో ఎమ్మె ల్యే మదన్రెడ్డి, హైకోర్టు సీనియర్ న్యాయవాది శివకుమార్గౌడ్, రమాదేవి దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేశ్గుప్తా, కౌన్సిలర్ అశోక్గౌడ్, బీఆర్ఎస్కేవీ జిల్లా ప్రధా న కార్యదర్శి సిలువేరు వీరేశం, సర్పంచ్లు అనూషాఅశోక్గౌడ్, లావణ్యామాధవరెడ్డి, సుధాకర్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు లాయక్, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, మండల కోశాధికారి బండా రి గంగాధర్, ప్రధాన పూజారి ధనుంజయశర్మ ఉన్నారు.