సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 1: పోలింగ్ విధులను తెలుసుకోవాలని సిద్దిపేట కల్టెకర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట నియోజకవర్గ ఎన్నికల ప్రొసిడింగ్, అసిస్టెంట్ ప్రొసిడింగ్ అధికారులకు పోలింగ్ విధులు, నిర్వహణపై సోమవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విధిగా పాటించాలన్నారు.
మాక్ పోలింగ్ మొదలుకొని పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల నియమావళి ప్రకారమే జరగాలన్నారు. అవసరమైతే ఈవీఎంల మార్పు, ఈవీఎంల పనితీరుపై పీవో, ఏపీవో, వోపీవోలు తెలుసుకోవాలని సూచించారు. సమావేశంలో సిద్దిపేట ఆర్డీవో సదానందం, మాస్టర్ ట్రైనింగ్ అధికారులు పాల్గొన్నారు.