మెదక్ మున్సిపాలిటీ, జనవరి 29 : మున్నూరుకాపు సంఘం మెదక్ పట్టణాధ్యక్షుడిగా కొం గోటి గట్టేశ్, యువజన అధ్యక్షుడిగా మాడిశెట్టి సుమన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఫతేనగర్ సంఘం భవనంలో మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి ఆధ్వర్యంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. మున్నూరుకాపు సం ఘం పట్టణ ప్రధాన కార్యదర్శిగా బెండల అశోక్, కోశాధికారిగా నాయిని ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా కామాటి కృష్ణ, యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా శివకుమార్, కోశాధికారిగా గౌతమ్ ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులను నాయకులు సన్మానించారు.
వారం రోజుల్లో పూర్తిస్థాయి కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో యువక మండలి జిల్లా కన్వీనర్ బోనగిరి చంద్రశేఖర్, టీఎంకేజేఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీధర్, ని యోజకవర్గ సమన్వయకర్త వీర్కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ ఆవారి శేఖర్, నాయకులు నాగభూషణం, వెంకన్న, బాలరామ్, దస్తయ్య, పూల మల్లేశం, రాము, మహిపాల్, నవీన్, శేఖర్, సిద్దు, శ్రీనివాస్, భరత్, నర్సింహులు, రూపేశ్, రమేశ్, గంగాధర్, మహేశ్ పాల్గొన్నారు.