మనోహరాబాద్, ఫిబ్రవరి 9: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ వేదికగా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మనోహరాబాద్ మండల కేంద్రంలో ప్రజలు, నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. నల్ల బాడ్జీలు ధరించి, మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణను దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్నామన్నారు. విభజన సరిగ్గా జరుగలేదని మాట్లాడి అమరుల త్యాగాలను హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారన్నారు. బీజేపీ పన్నుతున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వారికి గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పురం నవనీతరవి, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, పార్టీ మండలాధ్యక్షుడు పురం మహేశ్, ఎంపీటీసీ స్వర్ణలత, సర్పంచ్లు మాధవరెడ్డి, వెంకటేశ్వర్లు, నరేందర్రెడ్డి, ఉప సర్పంచ్లు మహేందర్గౌడ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సలీముద్దీన్, టీఆర్ఎస్ నాయకులు భిక్షపతి, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.