గజ్వేల్, ఫిబ్రవరి 17: ‘స్వయం పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష’ అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా శనివారం గజ్వేల్లోని కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ పచ్చని పాడిపంటలతో సుభిక్షంగా మారిందన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణను ముందు వరుసలో ఉంచిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. తెలంగాణ అభివృద్ధి దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్గా పదేండ్ల పాలనలో కనపడిందన్నారు. తొలి ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని తాగు, సాగునీటి రంగాల్లో ముందు వరుసలో ఉంచారన్నారు. కాళేశ్వరం, కొండపోచమ్మ, మల్లన్నసాగర్ లాంటి అనేక రిజర్వాయర్లు నిర్మించి మండుటెండల్లో సైతం రైతులకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్దేనన్నారు. కేసీఆర్తోనే అభివృద్ధి, సంక్షేమంలో గజ్వేల్ దాదాపు యాభై ఏండ్ల ముందుకెళ్లిందన్నారు.
గజ్వేల్ పరిధిలో ప్రాజెక్టులను నిర్మించి కూడవెళ్లి, హల్దీవాగులను జీవనదులుగా మార్చారన్నారు. అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం, అటవీ కళాశాల ఏర్పాటు చేశారని, బాలికలు, బాలుర విభాగాల్లో ఎడ్యుకేషన్ హబ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించారన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశంగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బెండ మధు, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, వైస్ ఎంపీపీ కృష్ణాగౌడ్, నాయకులు ఉడేం కృష్ణారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రమేశ్గౌడ్, రాజిరెడ్డి, గొడుగు స్వామి, వాసీంఖాన్, రవీందర్, అహ్మద్, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.