పటాన్చెరు/ దుబ్బాక, జనవరి 23: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కలిసి శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యేలు తెలిపారు.
పటాన్చెరు/ దుబ్బాక, జనవరి 23: పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగించేలా ఓడిపోయిన అధికార పార్టీ అభ్యర్థి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ నగరంలో ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్రెడ్డిని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గూడెం మహిపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజమన్నారు. రాజ్యాంగబద్ధంగా కల్పించిన ప్రొటోకాల్ హక్కును సైతం కాలరాయడం తగదన్నారు.