సిద్దిపేట, ఏప్రిల్ 17: శ్రీరాముడు ఆదర్శప్రాయుడని, పరిపాలన దక్షకుడు…ధర్మ నిరతుడని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శ్రీరామ నవమిని పురసరించుకొని సిద్దిపేట పట్టణంలోని పలు ఆలయాల్లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరాముడు హకుల కంటే బాధ్యత గొప్పదని రామతత్వం ద్వారా నిరూపించారన్నారు. కష్టంలోనైనా కలిసి నడవాలని సీతా తత్వమన్నారు. కష్టాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగితేనే విజయ లభిస్తుందని శ్రీరాముడు నిరూపించారని ఎమ్మెల్యే హరీశ్రావు చెప్పారు. శ్రీరాముడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు.
సిద్దిపేట పట్టణంలోని సీతారామచంద్రస్వామి కల్యాణ ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. నాలుగు గంటలపాటు 24 ఆలయాల్లో జరిగిన కల్యాణ ఉత్సవాల్లో పాల్గొంటూనే..మరొకవైపు ప్రజలను ఆత్మీయ పలకరించారు. హౌసింగ్ బోర్డ్లోని పంచముఖ హనుమాన్ ఆలయం, రంగదాంపల్లి హనుమాన్ ఆలయం, హరిప్రియనగర్ అభయాంజనేయ స్వామి ఆలయం, శివాజీ నగర్లోని పంచముఖ హనుమాన్ ఆలయం, హనుమాన్ టెంపుల్,దక్షిణముఖ ఆంజనేయ స్వామి ఆలయం, గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం,
హనుమాన్ నగర్ ఆంజనేయస్వామి ఆలయం, షిరిడీ సాయిబాబా టెంపుల్, నాసరపుర హనుమాన్ ఆలయం, గంజి హనుమాన్ ఆల యం, పారుపల్లి వీధిలోని రామాలయం, రామరాజు రావిచెట్టు హనుమాన్ ఆలయం, కాలకుంట కాలనీ హనుమాన్ టెంపుల్, నగర్ హనుమాన్ టెంపుల్, గాంధీనగర్ హనుమాన్ టెంపుల్, నర్సాపూర్ హనుమాన్ ఆలయాల్లో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నాయకులు వంగా నాగిరెడ్డి, ఐలయ్య సంపత్ రెడ్డి, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు ఉన్నారు.
చిన్నకోడూరు, ఏప్రిల్ 17: మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. మాచాపూర్, మేడిపల్లి గ్రా మాల్లో బుధవారం నిర్వహించిన రాములోరి కల్యాణోత్సవంలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్రావు పాల్గొన్నారు. కస్తూరిపల్లి, ఇబ్రహీంనగర్ పరిధిలోని రామన్నపల్లిలో నవగ్రహాల ప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరాముడి దీవెనలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, వైస్ ఎంపీపీ పాపయ్య, గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాముని శ్రీనివాస్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.