మెదక్ : మృత్యు ఒడికి చేరి అవయవాలను దానం చేసిన మోక్షిత్ కుటుంబ సభ్యులను
ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరామర్శించారు. మెదక్ పట్టణానికి చెందిన రాయకంటి శ్రీనివాస్-జ్యోతి కుమారుడు మోక్షిత్ ఇటీవల బ్రెయిన్ డెడ్ కారణంగా మరణించిన సంగతి విదితమే. ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మోక్షిత్ కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యాన్ని కల్పించారు. తాను మరణిస్తూ మరొకరికి బతుకనివ్వడం గొప్ప విషయం అన్నారు.
తొమ్మిది మంది రూపంలో మోక్షిత్ బతికే ఉన్నాడని పేర్కొన్నారు. మోక్షిత్ అవయవాలను దానం చేసిన తల్లిదండ్రులు జ్యోతి, శ్రీనివాస్ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ శ్రీనివాస్, జయరాజు, నాయకులు రాగి.అశోక్,కొండ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.