కొల్చారం, జూన్ 15 : పల్లెప్రగతితో పల్లెసీమలకు మహర్దశ పట్టిందని ఎమ్మెల్యే మదన్రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా కొల్చారం మండలంలోని నాయిన్జలాల్పూర్, వసురాంతండా, వెంకటాపూర్, కిష్టాపూర్, తుక్కాపూర్, రంగంపేట, ఏటిగడ్డమాందాపూర్, సీతారాంతండాలో పంచాయ తీ భవనాలను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా గురు వారం గ్రామపంచాయతీ భవన నిర్మాణాలకు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎమ్మెల్యే మదన్రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో కొత్తగా ఐదు గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పంచాయతీ భవనానికి రూ.20లక్షల నిధులు మంజూరైననట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మా ట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాల స్వరూపాలే మారిపోయాయన్నారు. ప్రతి పల్లెలో పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటయ్యాయన్నారు. ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, నీటి ట్యాంకర్తో రోడ్లన్ని పరిశుభ్రంగా మారాయన్నారు.
పోతంశెట్పల్లి, కిష్టాపూర్, రాంపూర్ గ్రామాల్లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను, వాటర్ ట్యాంకులను ప్రారంభించారు. ఆయా కార్యక్రమా ల్లో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అహ్మద్, ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, ఎంపీడీవో గణేశ్రెడ్డి, డీఈ లు కిషన్, అమరేశ్వర్, ఏఈలు ఇర్ఫాన్ హుస్సేన్, శ్రీకాంత్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్గుప్తా, బీఆర్ఎస్ యూ అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్లు మాధవి, బం డి సుజాత, గోదావరి, నాగరాణి, నెల్లి కిష్టయ్య, లంబాడి మోతి, ఎంపీటీసీలు ఉదయ, భాగ్యలక్ష్మి, ఎల్లయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి యాదయ్య పాల్గొన్నారు.