రామచంద్రాపురం,నవంబర్ 28: రామానుజాచార్యుల ఆలయ నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. భెల్ ఐఎన్టీయూసీ కార్యాలయ ఆవరణంలో చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం, వనభోజనాల కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవ్, రామానుజ ఫిలాసఫీ ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ చాత్తాద శ్రీవైష్ణవ కులం అంటే తనకు ఎంతో అభిమానమని పేర్కొన్నారు. భగవత్ రామానుజాచార్యులు అంటే ఎంతో నమ్మకం ఉంటుందని, స్వామివారి ఆలయాన్ని నియోజకవర్గంలో నిర్మించేందుకు కృషి చేస్తామన్నారు. చినజీయర్ స్వామి 108 దివ్యక్షేత్రాల నిర్మాణంలో భాగం రామానుజాచార్యుల వారి అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో స్వామివారి చరిత్ర, గొప్పతనం ప్రజలందరికీ తెలిసిందన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, సభ అధ్యక్షుడు శ్రీహరి, ప్రధానకార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొన్నారు.
టీఎస్ ఆర్టీసీ భెల్ డిపోను పరిరక్షించాలని కార్మికులు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. భెల్ ఆర్టీసీ డిపోను కుదించే ప్రయత్నం మేనేజ్మెం ట్ చేస్తున్నదని కార్మికులు వివరించారు. అన్ని పారా మీటర్లలోనూ భెల్ డిపో అగ్రభాగాన ఉన్నదని తెలిపారు. 101 షెడ్యూల్స్లో 53 షెడ్యూల్ బస్లను ఇతర డిపోలకు పం పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సిటీ రీజియన్లో కొనసాగిన డిపోను ఇప్పుడు రంగారెడ్డి రీజియన్లో కలిపే ప్రక్రియను యాజమాన్యం మొదలుపెట్టిందన్నారు. దీర్ఘకాలంగా డిపోలో పనిచేస్తున్న కార్మికులు బదిలీ అయ్యే అవకాశం ఉన్నదని కార్మికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే భెల్ డిపో యథావిధిగా నడిచేలా చూస్తామని, ఒక కార్మికుడిని కూడా బదిలీ కానివ్వమని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.
బొల్లారం, నవంబర్ 28 : ప్రజల అవసరాలకు అనుగుణంగా బొల్లారం మున్సిపాలిటీలోని వార్డులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నా రు. సోమవారం 4, 5 వార్డుల్లో 8.35 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్లు, వరదనీటి కాలువల అభివృద్ధి పనులకు చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.25కోట్లతో బొల్లారం మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో బొల్లారం మున్సిపాలిటీని ప్రగతి పథం లో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ రాజేంద్రకుమార్, టీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకుడు చంద్రారెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు హన్మంత్రెడ్డి, రాష్ట్ర కార్మిక నాయకులు వరప్రసాద్రెడ్డి, కౌన్సిలర్లు రాధ, శైలజ, బీరప్పయాదవ్, సతీష్, కో ఆప్షన్ సభ్యురాలు రెహానాబేగం, నాయకులు యాదిరెడ్డి, అబ్ధుల్ బషీర్, వెంకటయ్య పాల్గొన్నారు.