మెదక్, (నమస్తే తెలంగాణ)/ పాపన్నపేట, జనవరి 6: మెదక్ నియోజకవర్గ ప్రజల రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గా భవానీమాతను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేకు గ్రామ గ్రామాన స్వాగతం పలుకుతూ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఎనలేని అభిమానం చూపుతున్న ప్రజలు, కార్యకర్తలను చూసి ఆనందం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేకు ఏడుపాయల దేవస్థానం చైర్మన్ బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. ఏడుపాయల కమాన్ వద్ద జిల్లా బీఆర్ఎస్వీ కార్యకర్తలు క్రేన్ సహాయంతో గజమాలను వేసి సత్కరించి, కేక్ కట్ చేయించారు. అనంతరం కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు గౌస్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు సోములు, సర్పంచ్లు సర్పంచ్ కుమ్మరి జగన్, గురుమూర్తిగౌడ్, మర్రిలింగారెడ్డి, సంజీవరెడ్డి, వెంకట్రాములు, స్రవంతి శ్రీనివాస్, ఎంపీటీసీలు వసంత శ్రీనివాస్రెడ్డి, రాములు, మైనార్టీ సెల్ మండల నాయకుడు బాబర్ పటేల్, సీనియర్ నాయకులు బాబాగౌడ్, ఆంటోని, సాయిరెడ్డి, దుర్గయ్య పాల్గొన్నారు.
మెదక్లో ఘనంగా ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్, హవేళీఘనపూర్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట మండలాలకు చెందిన బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్ పాల్గొన్నారు. మెదక్ డీఎస్పీ సైదులు, పట్టణ సీఐ మధు, రూరల్ సీఐ విజయ్కుమార్, ఎస్సై రుక్సానాబేగం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజ్కుమార్, కోశాధికారి బట్టి రమేశ్, ఉపాధ్యక్షులు మంగ మనోహర్, ఎండీ ఇక్బాల్ పాషా, ఎండీ ఫజలుద్దీన్, సంయుక్త కార్యదర్శి రాధ, కార్యాలయ కార్యదర్శి కోటి రఘునాథరావు, ప్రచార కార్యదర్శి చిరంజీవి చార్యులు, కార్యవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు జంగం నగేశ్ పాల్గొన్నారు.