హుస్నాబాద్, జనవరి 9: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం హుస్నాబాద్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు హుస్నాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ఆర్డీవో, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు హుస్నాబాద్ ఆర్టీసీ డిపోకు మంజూరైన రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభిస్తారు.
సీనియర్ జర్నలిస్టు మంగళారపు లక్ష్మణ్ రచించిన ‘మాయని గాయాల నెత్తుటి చరిత్ర’ అనే పుస్తకావిష్కరణ బుధవారం సాయంత్రం ఉంటుందని హుస్నాబాద్ డివిజన్ ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు పిట్టల తిరుపతి, చల్లా రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్లో సాయంత్రం 4.30గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకావిష్కరణ చేస్తారని వారు పేర్కొన్నారు. మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, ఆచార్య ఘంటా చక్రపాణి, వి ప్రకాశ్, నారదాసు లక్ష్మణ్రావు తదితరులు హాజరవుతారని చెప్పారు. హుస్నాబాద్ ప్రాంతంలోని కవులు, కళాకారులు, మేధావులు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.