నర్సాపూర్, అక్టోబర్ 28 : నర్సాపూర్ పట్టణానికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదివారం పర్యటిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని 8 మండలాలకు చెందిన బీఆర్ఎస్ ము ఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి ఆధ్వర్యంలో జరుగనుంది. నర్సాపూర్లోని చాముండేశ్వరి ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకి సమావేశం ఉం టుందని వెల్లడించారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కార్యకర్తలకు మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేయనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి
నర్సాపూర్లోని కంజర్ల యాదవ్ ఫంక్షన్ హాల్లో మంత్రి పర్య టన ఏర్పాట్లను ఎమ్మెల్యే మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి పరిశీలించారు. వీరి వెంట మున్సిపల్ వైస్చైర్మన్ నయీమొద్దీన్, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, నాయకులు అశోక్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, జ్ఞానేశ్వర్, షేక్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.