అందోల్, ఏప్రిల్ 11 : అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని పేదల సొంతింటి కల నెరవేరుతున్నది. పేదలకు సొంతగూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగం గా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో 576 ఇండ్లను నిర్మించింది. గత నెలలో అధికారులు లక్కీ డ్రాలో 568 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. నేడు మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే క్రాం తికిరణ్ చేతులమీదుగా లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేయనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు.
విద్యుత్, రోడ్లు, తాగునీరు ఇతర వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేసేందుకు లబ్ధిదారులు సిద్ధమవుతున్నారు. ఇండ్ల నిర్మాణాలు నెల క్రితమే పూర్తికాగా, ప్రతిపక్షాలు ఇండ్ల పంపిణీలో రాజకీయం చేస్తూ కోర్టును ఆశ్రయించి, పలు రకాలుగా అడ్డంకులు సృష్టించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే దృష్టి సారించి లబ్ధిదారులతో పలుమార్లు మాట్లాడారు. ప్రతిపక్షాల నాయకుల గురించి వివరించడంతోపాటు అధికారులతో ఎప్పటికప్పు డు మాట్లాడుతూ ఇండ్ల పంపిణీకి సిద్ధం చేశారు. దీంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మంత్రి హరీశ్రావు పాల్గొనే కార్యక్రమాలు
మంత్రి పర్యటనను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే
మంత్రి హరీశ్రావు పర్యటనకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీతోపాటు బస్తీదవాఖాన, డయాలసిస్ సెం టర్, అంబేద్కర్ విగ్రహం, క్లాక్టవర్ వాచ్ ప్రారంభోత్సవంతోపాటు రోడ్డు వెడల్పు పనులు, సీసీ రోడ్డు, షాదీఖాన పనులు ప్రారంభిస్తారు. అందోల్ బీఆర్ఎస్ మండల నాయకుల ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది. సాయంత్రం శ్రీరామ గార్డెన్ ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొంటారు.