సిద్దిపేట టౌన్, జాన్ 1 : ప్రయాణికుల రద్దీకి అనుగణంగా నూతన డీలక్స్ బస్సు సేవలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రజల కోరిక మేరకు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు 7 నూతన డీలక్స్ బస్సులను ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సుదర్శన్తో కలిసి జెండా ఊపి గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట నుం చి సికింద్రాబాద్కు 42నాన్ స్టాప్ బస్సులు నడు స్తున్నాయని, అందులో 40 బస్సులు గజేల్-ప్రజ్ఞాపూర్ స్టాప్తో ప్రయాణం సాగుతుందన్నారు.
సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కు 82 షటిల్ బస్సు సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. నిత్యం సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులకు కరీంనగర్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు బైపాస్ మీదుగా వెళ్తున్నాయని, రాత్రి సమయంలో జేబీఎస్ నుంచి నేరుగా సిద్దిపేటకు బస్సు లు నడపాలని ప్రయాణికుల విన్నపం మేరకు డీలక్స్ సర్వీస్లు ప్రారంభించుకున్నామన్నారు.
ఆర్టీసీ మనది.. కాపాడుకుందాం
ప్రజారవాణా ఆర్టీసీ మనదని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల జీతాలు పెంపునకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, సిద్దిపేట డిపో మేనేజర్ సుఖేందర్రెడ్డి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.