టేక్మాల్, ఏప్రిల్ 11: మండలంలోని ధనూర గ్రామ శివారులోని వేంకటేశ్వరాలయంలో గురువారం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే పూజల్లో మంత్రి
దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. కార్యక్రమంలో నిమ్మ రమేశ్, మాన్ కిషన్, పాపయ్య, సాగర్, కిశోర్ పాల్గొన్నారు.