న్యాల్కల్, డిసెంబర్ 7 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడ్గి గ్రామానికి చెందిన యువరైతు ఇంద్రసేనారెడ్డి చెరుకు పంటలో అధిక దిగుబడులు సాధించాడు. దేశంలోని పలు రాష్ర్టాల్లో వివిధ పంటలు పండించి అధిగ దిగుబడిలు సాధించిన రైతులకు కృషిజాగరణ్ ఆఫ్ అగ్రికల్చర్ వరల్డ్, మహింద్రా ట్రాక్టర్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డికి మిలినియర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డును ఢిల్లీ గవర్నర్ అందజేశారు. మండలంలోని బసంత్పూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, రాష్ట్ర చెరుకు అభివృద్ధి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్, జహీరాబాద్ డీడీఎస్-కేవీకే శాస్రతవేత్త డాక్టర్ రమేశ్ ప్రోత్సహంతో ప్రయోగాత్మంగా మహారాష్ట్ర పూణే వసంత్వాడే పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన వీఎస్ఐ 12121 (8005 రకం) చెరుకు వంగడాన్ని ఇంద్రసేనారెడ్డి సాగు చేశాడు. తనకున్న పదెకరాల్లో మొదటిసారిగా డీడీఎస్-కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రమేశ్ సూచనల మేరకు 6వేల బర్డ్చీఫ్ మొక్కలు పొలంలో నాటాడు. శాస్త్రవేత్తల సూచనలు, సలహాల మేరకు పంటను పండించి ఎకరానికి 40టన్నుల దిగుబడి సాధించాడు.
రైతులను ప్రోత్సహించేందుకు డీడీఎస్-కేవీకే ఎంతో కృషి
ఏటా అధిగ దిగుబడులు సాధించేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. అందులో భాగంగా జహీరాబాద్ ప్రాంతంలో 35 వేల ఎకరాల్లో రైతులు చెరుకు పంటను సాగు చేస్తున్నారు. సరైన చెరుకు రకం పంటలు లేక రైతులు దిగుబడులు సాధించలేక నష్టపోతున్నారు. దీనికోసం ప్రయోగాత్మంగా మహారాష్ట్ర పూణే వసంత్వాడే పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తలు కనుగొన్న నూతన వీఎస్ఐ 12121 (8005 రకం) చెరుకు వంగడాన్ని ఇంద్రసేనారెడ్డి సాగు చేశారు. తనకున్న పదెకరాల్లో మొదటిసారిగా ఎకర పొలంలో 6వేల బర్డ్చీఫ్ మొక్కలు నాటి, ఎకరానికి 40టన్నుల దిగుబడి సాధించాడు.
అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది
డీడీఎస్-కేవీకే శాస్త్రవేత్తల అందజేసిన వీఎస్ఐ 21121 రకం చెరుకు పంటను సాగుచేశాను. మొదట ఎకరంలో సాగు చేసిన చెరుకు 40టన్నుల మేరకు దిగుబడి వచ్చిం ది. శాస్త్రవేత్తల సూచనలు, సలహాల మేరకు ఈ సంవత్సరం మరో ఆరెకరాల్లో చెరుకును సాగు చేశాను. ఈసారి ఎకరానికి 60టన్నుల వరకు అధిక దిగుబడి రానున్నది. చెరుకు పంటను పండించేందుకు గ్రామంలో మిగతా రైతులు ఆసక్తి చూపుతున్నారు. నూతనం చెరుకు వంగడాన్ని సాగు చేసి అధిక దిగుబడిని సాధించినందుకు ఢిల్లీకి వెళ్లి ఈ అవార్డును తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తనకు అవార్డు రావడానికి ఎంతో కృషి చేసిన డీడీఎస్-కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రమేశ్కు కృతజ్ఞతలు.
-ఇంద్రసేనారెడ్డి,యువరైతు, మామిడ్గి, న్యాల్కల్