సంగారెడ్డి కలెక్టరేట్, మే 26: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న టీ-20 అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. ఆదివారం కరీంనగర్, మెదక్ జట్ల మధ్య జరిగిన పోటీల్లో సమాన స్కోర్తో టైగా నిలిచింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మెదక్ జిల్లా జట్టు నిర్ధారిత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇందులో సందీప్రాజ్ 63, సాయినాథ్ 52 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.
రెండు జట్ల మధ్య స్కోర్ సమానం కావడంతో మ్యాచ్ టైగా నిలిచింది. కరీంనగర్ బ్యాటింగ్లో సూర్య 76 పరుగులు చేశాడు. మెదక్ జట్టు బౌలింగ్లో వేదాంత్ 3 వికెట్లు తీశాడు. ఈనెల 24న ప్రారంభమైన టోర్నీలో మొదటి మ్యాచ్లో ఆదిలాబాద్ జట్టుపై మెదక్ జిల్లా జట్టు విజయం సాధించగా, 25న వరంగల్ జట్టుపై కూడా 55 పరుగులతో విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్స్లోకి చేరిన మెదక్ జట్టు ఈనెల 28న మంగళవారం ఖమ్మం జట్టు మధ్య సెమీ ఫైనల్స్ పోటీ జరగనున్నదని మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్రెడ్డి తెలిపారు.