మెదక్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ద్వారకా గార్డెన్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులు, రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ రైతు బాగుంటేనే దేశం సుభీక్షంగా ఉంటుందని భావించి, రైతులపై మకువతో ఉచిత విద్యుత్, సాగు నీరు, రైతు బంధు అందించారన్నారు. దీంతో నేడు మెదక్ జిల్లాలో రెండు పంటలకు కలిపి లక్ష మెట్రిక్ టన్నుల నుంచి 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తున్నదన్నారు. ఈ ధాన్యాన్ని దళారుల ప్రమేయం లేకుండా కనీస మద్దతు చెల్లించి, రైతులకు భరోసా, ధైర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. అవసరం మేరకు కొత్త, పాత గన్నీ బ్యాగులు నిష్పత్తి ప్రకారం అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో షామియానా, మంచి నీటి ఏర్పాట్లు చేయాలన్నారు. కోనుగోలు కేంద్రాల్లో తూకం సరిగ్గా వేయడం లేదని, తాళ్లు ఉన్నాయని, రైస్ మిల్లుల వద్ద సకాలంలో ధాన్యం దించుకోవడం లేదని, గోనె సంచులు బాగా లేవని, లారీల సమస్య ఉత్పన్నమవుతున్నాయని ఫిర్యాదులున్నాయన్నారు. ఇవే కాకుండా కేంద్రానికి, మిల్లుకు ట్యాగింగ్ చేసిన ప్రకారం రావడం లేదనే సమస్యలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అటువంటివి జరగకుండా చూడాలని, లేకుంటే చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా సరిహద్దులో సాగు చేసిన ధాన్యం లేదా అటవీ భూముల్లో పండిన ధాన్యంపై వ్యవసాయ అధికారులు పంట వివరాలు నమోదు చేసి కొనాలన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్ మాట్లాడుతూ ఈసారి ధాన్యంలో తాళ్లు ఎకువగా వచ్చే అవకాశమున్నందున ప్యాడీ క్లీనర్లు పెట్టి శుభ్రం చేసి, ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కలిగించాలన్నారు. కనీస మద్దతు ధర క్వింటాల్కు ఏ-గ్రేడ్ 2060, సాధారణ రకం రూ.2040 ప్రకటించిన గోడ పత్రిక, కరపత్రాన్ని ఆవిషరించారు. సమావేశంలో జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు చంద్ర పాల్, ఇఫో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, జిల్లా సహకార అధికారి కరుణ, డీఎస్పీ సైదులు, ఆర్డీవో సాయిరామ్, జడ్పీ సీఈవో శైలేశ్, డీపీవో సాయిబాబా, వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, ఐకెపి సిబ్బంది, ఫ్యాక్స్ చైర్మన్లు, రైస్ మిల్లర్లు, మారెటింగ్ కమిటీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ యాసంగిలో 4 లక్షల 43 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం విపణిలోకి వచ్చే అవకాశముందన్నారు. అందుకనుగుణంగా పాక్స్, ఐకేపీ, డీసీఎంఎస్, రైతు ఉత్పత్తి సంస్థల ఆధ్వర్యంలో 406 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి కేంద్రంలో కావాల్సిన ఎలక్ట్రానిక్ కాంటాలు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచామన్నారు. గోనె సంచుల కొరత లేదని, మానిటరింగ్ చేసేందుకు ఇద్దరు సీనియర్ అధికారులను నియమించామన్నారు. కొనుగోళ్ల ప్రక్రియ ముగిసే 45 రోజులు చాలా క్లిష్టమైనవని, ఒక యజ్ఞంలా భావించి అందరూ సమిష్టిగా పనిచేయాలన్నారు. ఎటువంటి సెలవులు మంజూరు చేయబడన్నారు. లోటుపాట్లను గుర్తించి అధిగమించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ విస్తరణాధికారుల పాత్ర చాలా కీలకమన్నారు. రైతులు ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు అనుగుణంగా ఏ గ్రామం, ఏ రోజు కేంద్రానికి ధాన్యం తీసుకురావాలో టోకెన్లు జారీ చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆ జాబితా ప్రదర్శించాలన్నారు. జిల్లాలో 35 బాయిల్డ్ రైస్ మిల్లులకు ధాన్యం తరలించేలా కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు లారీలు పంపేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నామన్నారు. ట్యాబ్ ఎంట్రీలు పకాగా చేసేలా చూడాలన్నారు. సమస్యలను వెంటనే పరిషరించాలని లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, తహసీల్దార్లు రోజూ 2, 3 కేంద్రాలను సందర్శించి, సజావుగా కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. 2021-22 యాసంగికి సంబంధించి సీఏంఆర్ రైస్ పూర్తి చేసి ధాన్యం నిలువకు స్థలం ఏర్పాటు చేసుకోవాలని రైస్ మిల్లర్లకు సూచించారు. ధాన్యం భద్రపరిచేందుకు గోదాంలు గుర్తించామన్నారు.