మెదక్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): వినియోగదారుల సౌకర్యార్థం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ BIS CARE APPను రూపొందించిందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత జాతీయ ప్రమాణాల సంస్థ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం ఎలక్ట్రికల్ ఉత్పత్తులకు తప్పనిసరిగా ఐఎస్ఐ మార్ రిజిస్ట్రేషన్, మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ పొంది ఉండాలన్నారు.
బంగారు, వెండి ఆభరణాలకు హాల్ మారింగ్ ఉండాలన్నారు. ఇందుకోసం BIS వారు ఐఎస్ఐ మార్ ఉన్న వస్తువు ప్రామాణికతను తెలుసుకోవడానికి, హాల్ మార్ గల ఆభరణాల ప్రామాణికతను తెలుసుకోవడానికి BIS CARE APPను రూపొందించిందన్నారు. ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్ లోడ్ చేసుకొని పై వాటి తో పాటు తప్పనిసరిగా ఐఎస్ఐ మార్ ఉండాల్సిన ఉత్పత్తుల వివరాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రామాణికత తదితర వివరాలను తెలుసుకోవచ్చని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ఉత్పత్తిలో నాణ్యతా లోపం లేదా ఐఎస్ఐ. చిహ్నం దుర్వినియోగంపైనా అదనపు సమాచారం కోసం hybo@bis.gov.in మెయిల్ ద్వారా కోరవచ్చని ఆమె పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల కింద ఉత్పత్తులు సేకరణ, సేకరణ ప్రక్రియలో BIS ప్రామాణికతకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పతులు కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.