సదాశివపేట, సెప్టెంబర్ 3: ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలందించడానికి డాక్టర్లు అన్నివేళలా అం దుబాటులో ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి సదాశివపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ సందర్శించారు. పట్టణంలో నిర్మిస్తున్న సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్, డబుల్ బెడ్రూం ఇండ్ల పురోగతిని, హెల్త్ సెంటర్లో పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. వైద్య సేవల గురించి ఆరా తీశారు. అక్కడున్న రోగులతో మాట్లాడి దవాఖానలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కొందరు వైద్యులు రోగులను నిలబెట్టి చికిత్స చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గర్భిణులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు చేసుకోవాలని, ప్రైవేట్కు వెళ్లవద్దని సూచించారు. ప్రెవేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో అధునాతన వైద్య సదుపాయాలు ఉన్నాయని, స్పెషలిస్ట్లతో వైద్య సేవలు అందిస్తారని పేర్కొన్నారు.
వివిధ కారణాలతో డెంటల్ తదితర వైద్య పరికరాలను వినియోగించకుండా పక్కన పెట్ట డం, దవాఖాన పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో కలెక్టర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. దవాఖానలో అన్ని చోట్ల చెత్త కుండీలు ఏర్పాటు చేయడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య నిర్వహణ ఉం డాలని సూపరింటెండెంట్కు సూచించారు. ఫార్మ సీ రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పట్టణంలో నిర్మిస్తున్న సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పరిశీలించి, వేగవంతం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.