సిద్దిపేట, ఆగస్టు 10 ;స్వాతంత్య్ర వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా, పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నదని, ఇందులో ప్రతీ పౌరుడు పాల్గొనాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన సిద్దిపేటలో ఫ్రీడమ్ పార్కు ప్రారంభించారు. దుబ్బాక దేవాలయ బ్రహ్మోత్సవాలకు హాజరయ్యారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు త్వరలోనే సీఎం కేసీఆర్ రానున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 20 లక్షల జాతీయ జెండాల పంపిణీ చేస్తున్నామని, ఇంటింటిపై జాతీయ జెండా ఎగరాలన్నారు.