కొండాపూర్, జూలై 5 : పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మాజీ ఎంపీటీసీ నీరడి డేవిడ్ భార్యకు రూ.2లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేవిడ్కు పార్టీ సభ్యత్వం బీమా చేయంతో వారి కుటుంబానికి ప్రభుత్వం, పార్టీ తరఫున రూ.2లక్షల ప్రమాద బీమా అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందన్నారు. రెండుసార్లు టీఆర్ఎస్కు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారన్నారు. ప్రమాదబీమా పథకాన్ని ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. నేడు జాతీ య స్థాయిలో లేని సభ్యత్వ నమోదు రాష్ట్రస్థాయిలో ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అన్నారు.
దేశం లో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని చురకలంటించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మావతీపాండురంగం, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రుక్ముద్దీన్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీరాంచంద్రయ్య, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు మ్యాకం విఠల్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మల్లేశం, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, సర్పంచ్ శివలీలాజగదీశ్వర్, ప్రకాశం, రాములు, ఎంపీటీసీ రాందాస్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.