మెదక్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): జిల్లాలో సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా దోమల వల్ల కలిగే మలేరియా, చికెన్గున్యా, డెంగీ, వైరల్ ఫీవర్తో పాటు కలుషిత నీటితో వచ్చే డయేరియా తదితర వ్యాధుల నివారణకు వైద్యులు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అధికారులు తీసుకుంటున్న చర్యలతో దోమల నుంచి వచ్చే వ్యాధులు తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వైద్యాధికారులతో సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపట్టాల్సిన కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా చూస్తున్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వైద్య సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. జిల్లాలో డెంగీ కేసులు నమోదైనైట్లెతే ఆ ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ చేపడుతు న్నారు. దోమల నివారణకు ఫెయంత్రం స్ప్రేను ఉపయోగించడం, కాలువల్లో లార్వా వృద్ధి చెందకుండా థీమో ఫాక్స్ను కలిపి చల్లుతున్నారు.
బృందాల ఏర్పాటు..
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టేందుకు జిల్లా, డివిజన్, పీహెచ్సీ స్థాయిల్లో బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి బృందంలో సహాయ మలేరియా అధికారి, హెల్త్ సూపర్వైజర్, హెల్త్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియన్, పిచికారీ పర్యవేక్షణకు ఒకరు ఉంటారు. అలాగే డివిజన్ స్థాయిలో డిప్యూ టీ డీఎంహెచ్వో, సబ్ యూనిట్ అధికారి, ముగ్గురు హెల్త్ అసిస్టెంట్లను నియమించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యాధికారి, కమ్యూనిటీ హెల్త్ అధికారి, ల్యాబ్ టెక్నిషియన్, ఆశ, పం చాయతీ కార్యదర్శి, హెల్త్ సూపర్వైజర్ ఉన్నారు. ఈ బృం దాల పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ప్రతి శుక్రవారం డ్రై డే..
ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ పంచాయతీ, వైద్య శాఖ ఆధ్వర్యంలో దోమల నివారణకు మందు పిచికారీ చేయిస్తున్నారు. ప్రతి రోజూ ఫాగింగ్ నిర్వహిస్తున్నారు. వర్షాకాలంలో రాబోయే మూడు నెలలు దోమలు వృద్ధి చెందకుండా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల కు దోమ తెరలను పంపిణీ చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లా లో 12,500దోమ తెరలను పంపిణీ చేసినట్టు వైద్యాధికారులు తెలిపారు. పాపన్నపేట, పొడ్చన్పల్లి పీహెచ్సీలతో పాటు దొంగ ల ధర్మారం పీహెచ్సీ పరిధిలోని కోనాపూర్లో దోమ తెరలను పంపిణీ చేశారు.
జిల్లాలో 19 పీహెచ్సీలు.. 2 సీహెచ్సీలు
మెదక్ జిల్లాలో 21మండలాల్లో 19 పీహెచ్సీలు 2సీహెచ్సీలు, ఒక అర్బన్హెల్త్సెంటర్, ఒక ఏరియా దవాఖాన, ఒక జిల్లా కేంద్రం దవాఖాన ఉంది. వీటి పరిధిలో సీజనల్పై దృష్టి పెట్టేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎక్కడా మురుగునీరు నిల్వలేకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో వ్యాధులు ప్రబలడానికి కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపడుతున్నా రు. ప్రతి సంవత్సరం దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పారిశుధ్య నిర్వహణపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా నీరు నిల్వ ఉండకుండా కాల్వలను శుభ్రం చేయాలని గ్రామ పంచాయతీల్లో సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. బావులు, తాగునీటి పథకాలు, మురుగునీటి నిల్వ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా పారిశుధ్య పనులు చేయించాలని సూచిస్తున్నారు. కాల్వలు పూడికతీత పనులు చేపట్టిన తర్వాత దోమల వృద్ధి కేంద్రాల్లో బ్లీచింగ్, సున్నం వంటి కీటక నాశన మందులు చల్ల డం పనులు చేస్తున్నారు.
జిల్లాలో తగ్గుముఖం పట్టిన కేసులు..
జిల్లాలో 2018నుంచి మలేరియా, డెంగీ కేసు లు తగ్గుముఖం పట్టాయి. 2018లో డెంగీ కేసులు 47కాగా, 2019లో 100 కేసులు, 2020లో 22కేసులు, 2021లో 38కేసులు, 2022 మేలో 2కేసు లు నమోదయ్యాయి. ఇదిలావుండగా 2018లో మలేరియా 12కేసులు, 2019లో 10కేసులు, 2020లో 2కేసులు, 2021లో 2కేసులు నమోదయ్యాయి. కొన్ని గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో కొన్ని లోపాలు ఉండటం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంది. దీని వల్ల విషజ్వరాల బారిన పడి ప్రజ లు దవాఖానాల పాలవుతున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరమవుతాయి.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
ఈ ఏడాది సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా కీటకజనిత వ్యాధులను అరికట్టేలా చర్యలు తీసుకోవడంతో పాటు, నీటి సంబంధ వ్యాధులను నివారించేలా ప్రణాళికలు రూపొందించాం. గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమ త్తం చేస్తున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయా వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటు లో ఉన్నాయి. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తు న్నాం. జిల్లాలో ఈ ఏడాది 12,500దోమ తెరలను పంపిణీ చేశాం.
– డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో, మెదక్