నర్సాపూర్/రామాయంపేటరూరల్/చిలిపిచెడ్/ చేగుంట, మే 12 : కొనుగోలు నుంచి రైస్మిల్లుకు వచ్చే ధాన్యాన్ని తక్షణమే లారీల నుంచి అన్లోడ్ చేసుకోవాలని రైస్మిల్లుల య జమానులకు అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్ యార్డుతోపాటు రెడ్డిపల్లి గ్రామంలోని రైస్మిల్లును సందర్శించి, వారికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ.. లారీల్లో వచ్చిన ధాన్యాన్ని అన్లోడ్ చేయ కుండా రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటఉపేందర్రెడ్డి, తహసీల్దార్ భాస్కర్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్, ఆర్ఐ షరీఫ్, మార్కెట్ యార్డ్ సిబ్బంది, రైస్ మిల్లుల యజమానులు ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.
ప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట ప్రాథమి క వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు బాదె చంద్రం సూచించారు. రా మాయంపేట మండలం దామరచెర్వు గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దని, కొనుగోలు కేంద్రాల్లో అమ్మితే మద్దతు ధర రావడంతోపాటు తూకంలో ఎలాం టి అవకతవకలు ఉండవని వివరించారు. రైతులకు అన్ని వి ధాలుగా మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పడాల శివప్రసాద్రావు, ఉప సర్పంచ్ దండు రమేశ్, పాకాల చంద్రశేఖర్రావు, సొసైటీ డైరెక్టర్ దేవుని నర్సింహులు, సొసైటీ సీఈవో పుట్టి నర్సింహులు పాల్గొన్నారు.
రైతుకు మద్దతు ధర : తహసీల్దార్ కమలాద్రి
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని తహసీల్దార్ కమలాద్రి అన్నారు. చిలిపిచెడ్ మం డలంలోని జగ్గంపేట, గౌతాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. రైతులు ధాన్యంలో తాలు, మట్టి, పొల్లు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలన్నారు. రై తులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టాలని సూచించారు. ధాన్యం తరలింపులో లారీల కొరత లేకుండా చూస్తామన్నారు. రైతు లు ధాన్యాన్ని అమ్మిన వెంటనే పట్టాపాస్బుక్, ఆధార్కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రాలను అందజేయాలన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ పరమేశ్ అన్నారు. నార్సింగి మండలం భీంరావ్పల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రా మాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తామ న్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కాపు ఎల్లమ్మ, వార్డు సభ్యు డు బోయిని భూషణం, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు.