మనోహరాబాద్, మే 12 : గ్రామాలాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని, పంచాయతీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అడగక ముందే కోట్లాది నిధులను మంజూరు చేస్తున్నారని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో రూ. 25లక్షలతో నిర్మించే నూ తన గ్రామ పంచాయతీ భవనం, రూ. 20 లక్షల గడా నిధులతో నిర్మించే మహిళా భవన నిర్మాణ పనులకు గురువారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ… తెలంగాణ ఏర్పడిన అనతి కాలంలోనే పల్లెలు పట్టణాలను తలదన్నే విధంగా తయారయ్యాయన్నారు.
పల్లెప్రగతితో తెలంగాణలోని పల్లెలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరిగిందన్నారు. రైతును రాజును చేయడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్ ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మ న్ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఎంపీపీ నవనీతారవి ముదిరాజ్, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, ఎంపీటీసీ లావణ్యముదిరాజ్, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి, ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్ ముదిరాజ్, నాయకులు పాల్గొన్నారు.
ప్రతిగింజా కొనుగోలు చేస్తాం : జడ్పీ చైర్పర్సన్
రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగో లు చేస్తుందని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించా రు. అనంతరం ఆమె మాట్లాడుతూ… తెలంగాణ రైతాంగా న్ని ఆగం చేసేందుకు కేంద్రం కుట్రపూరిత చర్యలు పాల్పడుతుందని ఆరోపించారు. మనకు సీఎం కేసీఆర్ ఉన్నారని, రైతులు అధైర్యపడొద్దన్నారు. రైతులను ఆదుకునేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొంటున్నారన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్లు నర్సయ్య, నాగభూషణం ఉన్నారు.