నర్సాపూర్/ కొల్చారం/ చిలిపిచెడ్, నవంబర్ 26 : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని నర్సాపూర్ తహసీల్దార్ ఆంజనేయులు సూచించారు. శనివారం నర్సాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓట రు నమోదు నిర్వహించారు. ఓటరు నమోదుపై నవంబర్ 26, 27 డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమన్నారు. కార్యక్రమంలో బీఎల్వోలు పాల్గొన్నారు.
ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి
ప్రతి ఒక్కరూ ఓటుహక్కును నమోదు చేసుకుని, ఆధార్తో అనుసంధానం చేసుకోవాలని పం చాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. కొల్చారం మండలంలోని ఎనగండ్ల గ్రామంలో ఓటుహక్కు పై అవగాహన కల్పించారు. ప్రతి ఓటరు ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలన్నారు. ఓటరు ఇంటిపేరు, పేరు, చిరునామాల్లో సవరణలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఎల్వోలు పాల్గొన్నారు.
తప్పొప్పులను సరి చేసుకోవాలి
చిలిపిచెడ్ మండలంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ ఆదర్శ్కుమార్ పేర్కొన్నారు. ఫైజాబాద్, బండపోతుగల్, అజ్జమర్రి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ పరిశీలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఓటు హక్కు కీలకమన్నారు. ఓటరులో పేర్ల్ల మార్పులు చేర్పులకు ఆన్లైన్, మీ సేవ కేంద్రాలు లేదా బూత్ లెవల్ అధికారులను సంప్రదించాల న్నారు. ఆయన వెంట వీఆర్ఏలు పాల్గొన్నారు.