పారదర్శకంగా పోలీస్ ఎంపికలు
సంగారెడ్డి, నవంబర్19: పోలీస్ రిక్రూట్మెంట్ ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని, అందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేశామని ఎస్పీ రమణకుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జరుగనున్న శారీరధారుడ్య పరీక్షల ఏర్పాట్లను శనివారం ఎస్పీ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శారీరధారుడ్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులు పాల్గొనే ఈవెంట్లు పరుగు పందెం, లాంగ్జంప్, షార్ట్ పుట్లకు ట్రాక్లు, డిచ్లను సిద్ధం చేశామన్నారు.
శారీరక దారుఢ్య పరీక్షలకు సన్నద్ధం కావాలి
హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్
సంగారెడ్డి, నవంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసిందని రాత పరీక్షల్లో రాణించిన అభ్యర్థులు శారీరక ధారుడ్య పరీక్షలకు సన్నద్ధమై ఉద్యోగాలు సాధించాలని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ సూచించారు. శనివారం పోలీసు ఉద్యోగాలు సాధించేందుకు సంగారెడ్డిలోని పోలీసు పరేడ్ మైదానంలో శరీరీధారుడ్య పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్తో కలిసి పౌష్టికాహారం, పాలు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఉద్యోగాలు సాధించేందుకు ఉచిత కోచింగ్ ఇవ్వండతో పాటు శారీరక ధారుడ్య పరీక్షల నిమిత్తం సన్నద్ధం చేయడం సంతోషకరమన్నారు. అందుకు పోలీస్ పరేడ్ మైదానంలో ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఎస్పీ కల్పించడం అభ్యర్థులకు శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డీఎస్పీ రవీంద్రారెడ్డి, కౌన్సిలర్ అశ్వీన్ కుమార్, బాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్రెడ్డి, నాయకులు చిటుకుల మల్లేశం, చక్రపాణి, లాడే మల్లేశం తదితరులున్నారు.
పేదింట్లో కల్యాణ కాంతులు
సదాశివపేట, నవంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింట్లో కల్యాణ కాంతులు వెలుగొందుతున్నాయని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో పట్టణంలోని 11 మంది, మండలంలోని ఆత్మాకూర్, పెద్దాపూర్, కోనాపూర్కు చెందిన 14 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో భరోసా ఇస్తున్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, రవి, నస్రీమ్ బేగం, నల్లా శివలక్ష్మి, విద్యాసాగర్రెడ్డి, కంది ఇంద్రమోహన్గౌడ్, ముంతాజ్బేగం, సాతాని లలిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.