రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాలను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. దుకాణ సముదాయాల నుంచి ఆదాయం వస్తుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన దుకాణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సునీతాలక్ష్మారెడ్డి కోరారు.
– నర్సాపూర్, నవంబర్ 19
నర్సాపూర్, నవంబర్19: రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన దుకా ణ సముదాయాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయా అశోక్గౌడ్, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కెట్ యార్డు లో ధర్మకాంటను 20 రోజుల లోపు ప్రధాన రోడ్డు వైపునకు తరలిస్తామన్నారు. మున్సిపాలిటీలోని పశువుల సంతను మార్కెట్ యార్డు పరిధిలోకి త్వరలో తీసుకొస్తామన్నారు.
వ్యవసాయ అనుబంధ సంస్థలను ఒకే తాటి పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, కొనుగోలు కేంద్రాలు తదితర పథకాలు తీసుకొచ్చారన్నారు. దుకా ణ సముదాయాలతో మార్కెట్ యార్డుకు మంచి ఆదాయం చేకూరుతుందన్నారు. సునీతాలక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పు డు మార్కెట్ యార్డు కోసం స్థలం కేటాయించారన్నారు. త్వరలో కాళేశ్వరం నీళ్లు నర్సాపూర్ నియోజకవర్గానికి వచ్చేలా కృషి చేస్తానన్నారు.
మార్కెట్ యార్డుదినదినాభివృద్థి చెందాలి
నర్సాపూర్ మార్కెట్ యార్డు దినదినాభివృద్ధి చెందాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో స్థలం లేకపోవడంతో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయలేదని, రైతుల నుంచి 13 ఎకరాల స్థలాన్ని కొని 8 ఎకరాలు మార్కెట్ యార్డుకు, ఐదెకరాలు ఇండ్ల నిర్మాణానికి ఇచ్చినట్లు తెలిపారు. ఆ స్థలంలో ఎమ్మెల్యే, మార్కె ట్ కమిటీ సభ్యుల కృషితో మార్కెట్ యార్డును నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యంతో పాటు పప్పు దినుసులు అమ్ముకునే వెసులుబాటు ఇక్కడ ఉన్నదని,దీనిపై మార్కెట్ కమిటీ సభ్యులు దృష్టి సారించాలని అన్నారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, ఏఎమ్సీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, చిలిపిచెడ్ ఎంపీపీ వినోద, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, డైరెక్టర్లు జ్ఞానేశ్వర్, సాగర్, శ్రీనివాస్రెడ్డి, నర్సింహులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.