చిన్నకోడూరు, నవంబర్ 1: మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు బాగున్నాయని అసిస్టెంట్ సెక్షన్ ఆఫ్ సెంట్రల్ సెక్రటేరియట్ సభ్యులు అమృత్ కుమార్, కృష్ణన్కౌర్ గోయల్, జయసింగ్ మీనా, అరవింద్ కుమార్ అన్నారు. మంగళవారం కిష్టాపూర్ గ్రామాన్ని కేంద్ర బృందం సభ్యులు సందర్శించారు. గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రామస్తులతో ముచ్చటించారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ ఫలాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కలియ తిరుగుతూ ప్రభుత్వం అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్లో చిన్నారులతో ముచ్చటించారు. వారి వెంట ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ కవిత, ఎంపీటీసీ లక్ష్మయ్య, అధికారులు శివకుమార్, బ్రహ్మం గ్రామస్తులు ఉన్నారు.
రేగులపల్లిలో..
మండలంలోని రేగులపల్లిలో రెండో రోజూ సెంట్రల్ మినిస్ట్రీ సర్వీసెస్ ట్రైనీ అధికారుల బృందం పర్యటించింది. ఈ సం దర్భంగా గ్రామంలోని పల్లె పకృతి వనం, డంపింగ్యార్డు, వన నర్సరీలు, అభివృద్ధి పనులను పరిశీలించారు. వారి వెంట సర్పంచ్ ఐలయ్య, ఇన్చార్జి ఎంపీడీవో అంజయ్య, బృంద సభ్యులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
అభివృద్ధి పనులు పరిశీలన
మండలంలోని కొండాపూర్ గ్రామంలో ట్రైనీ కలెక్టర్లు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, బాల వికాస కేంద్రం, పారిశుధ్య పనులు, బతుకమ్మ మెట్లు, పెద్ద చెరువు, ఐకేపీ సెంటర్లను పరిశీలించారు. పశువుల వైద్యాధికారిని కలిసి పశువుల ఆరోగ్య పరిరక్షణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట సర్పంచ్ పెద్ది కవి రాజు, ఉప సర్పంచ్ అమర్, ప్రజలు ఉన్నారు.
నాగారం గ్రామంలో పర్యటన
మండలంలోని నాగారం గ్రామంలో ట్రైనీ ఐఏఎస్ల బృందం పర్యటన రెండోరోజూ కొనసాగింది. గ్రామంలోని డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలను ట్రైనీ ఐఏఎస్ల బృందం అధికారులతో కలిసి పరిశీలించింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో తిరుగుతూ ఇంటింటా సర్వే నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధుల వినియోగం, అభివృద్ధి పథకాలు తదితరాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మల్లంపల్లిలో..
మండలంలోని మల్లంపల్లిలో కేంద్ర ట్రైనీ ఐఏఎస్ అధికారుల బృందం మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గ్రామంలోని వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృ తి వనం, నర్సరీని సందర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వారి వెంట ఎంపీడీవో కొప్పుల సత్యపాల్రెడ్డి, ఎంపీవో కవి కుమార్, ఏపీ వో ప్రభాకర్, మహిళా సంఘాల సభ్యులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఉన్నారు.