బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కృషీవలుడు. యువతకు ఉపాధి కల్పనలో ఆయనో మార్గదర్శి. ఆడపడుచులకు ఆయన మేనమామ. వృద్ధులు, అభాగ్యులకు ఆయన పెద్దన్న. బంగారు తెలంగాణ సాధనకు నడుంకట్టిన సీఎం కేసీఆర్ దేశానికి బంగారు బాటలు వేసేందుకు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీని తీసుకొచ్చారు. బీఆర్ఎస్కు దేశమంతటా ఆదరాభిమానాలు లభిస్తున్నాయి. తెలంగాణలో తన మార్కు పాలన చూపించిన సీఎం కేసీఆర్, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ తన మార్కు చూపిస్తారనే నమ్మకం అంతటా కనిపిస్తున్నది. ప్రజల అవసరాలకు అనుగుణంగానే పథకాలు రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. ఇలాంటి నాయకుడు దేశానికి కావాలని పేదలు కోరుకుంటున్నారు. దేశ ప్రగతి మారాలంటే సీఎం కేసీఆర్ రావాల్సిందేనని ఆకాంక్షిస్తున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 13
ఎనిమిదేండ్ల బీజేపీ పాలనతో దేశ ప్రజలు విసిగిపోయారు. దేశంలో మత పిచ్చి తప్ప… అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. ప్రధాని మోదీ రూపంలో దేశానికి పట్టిన దరిద్రం పోవాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యం. మోదీ సర్కారు దేశంలోని ప్రభుత్వరంగాలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజల నడ్డివిరుస్తున్నారు. దీంతో దేశ ప్రజలు టీఆర్ఎస్(బీఆర్ఎస్) వైపు చూస్తున్నారు. దేశం రూపురేఖలు మారాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాల్సిందే.
– గొల్ల రాములు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల సీనియర్ నాయకుడు, మిరుదొడ్డి
రానున్న రోజుల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది. ఎనిమిదేండ్ల కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఊహకందని రీతిలో అభివృద్ధి సాధించింది. సీఎం కేసీఆర్ పాలనాపరమైన సంస్కరణలు తెచ్చి, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. రాష్ర్టాన్ని బాగుచేసిన వ్యక్తికి దేశాన్ని ఎలా నడపాలో బాగా తెలుసు. తెలంగాణలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచిన ఘనత కేసీఆర్కే దక్కింది. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది.
– చింతల శ్రీశైలం ముదిరాజ్, ముదిరాజ్ సంఘం నాయకుడు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వర్గల్ మండల ఉపాధ్యక్షుడు
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ (టీఆర్ఎస్)ను ఏర్పాటు చేయడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలకు అవసరమైన ఉపాధి, ఉద్యోగ అవకాశలు కల్పించి, ప్రజలందరి మనసును బీఆర్ఎస్ (టీఆర్ఎస్) చూరగొంటుంది. దేశ జీడీపీని పెంచడం, దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం సీఎం కేసీఆర్తో సాధ్యం. ఎలా అభివృద్ధి చేయాలి, ప్రధాన సమస్యలు పరిష్కరించాలో సీఎం కేసీఆర్ వద్ద విజన్ ఉంది. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకూ అమలు చేసే సత్తా కేసీఆర్కు ఉంది.
– లావణ్యా నరేశ్, ఎంపీటీసీ-1 జిన్నారం
బీఆర్ఎస్ ఆవిర్భావం చరిత్రాత్మకం. టీఆర్ఎస్(బీఆర్ఎస్) అంచలంచెలుగా ఎదుగుతూ దేశంలో బలమైన రాజకీయ శక్తిగా మారుతున్నది. దేశ ప్రజలందరూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ విజయం సాధించి తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్తోనే దేశంలోని పేదలకు మేలు జరుగుతుంది. బడుగు, బలహీన వర్గాల గురించి ఆలోచించే, వారి ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తారు.
– మంగమ్మ రాంచంద్రం, మర్కూక్ జడ్పీటీసీ
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ అధినేత సీఎం కేసీఆర్తోనే భారతావనికి నవశకం తీసుకొస్తుంది. దేశ ప్రధానిగా అన్ని విధాల యోగ్యుడు సీఎం కేసీఆర్. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా ఎలా తీర్చిదిద్దుతున్నారో, అదే మాదిరిగా దేశాన్ని కూడా కూడా అభివృద్ధి చేయగలరు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించగల సమర్ధుడు. కేసీఆర్ సార్ వెంటనే రాష్ట్ర ప్రజలు, పొరుగు రాష్ర్టాల ప్రజలు ఉంటారు.
– చిమ్ముల గోవర్ధన్రెడ్డి, గుమ్మడిదల మండలం
దేశంలోని దళితుల అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న దళిత బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, తాగు, సాగు నీరు వంటి ఎన్నో పథకాలు అన్ని రాష్ర్టాల్లో అందినప్పుడే రైతులు, సామాన్యులకు మేలు జరుగుతుంది. సీఎం కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు దేశానికి ఎంతైన అవసరం.
– ఆనందాస్ మహేశ్వరి, సర్పంచ్, వల్లూర్, నార్సింగి మండలం
దళితులపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చిన్న చూపు చుస్తున్నది. దేశంలో దళితులకు రక్షణ కరవైంది. దళితుల కోసం తెంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశంలోని అన్ని రాష్ర్టా ల్లో అమలు కావాలంటే సీఎం కేసీఆర్ లాంటి నాయకుడే సాధ్యం.
– బాలసాయి హరిప్రసాద్, ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి, చేగుంట
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సీఎం కేసీఆర్తోనే సాధ్యం. ఆయన సేవలు దేశానికి అవసరం. తెలంగాణలో ఇంటింటికీ చేరుతున్న సంక్షేమ ఫలాలు దేశంలోని ప్రజలందరికీ అందుతాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దేశానికి దిక్సూచిగా నిలుస్తుంది. సమూల మార్పులు తీసుకొచ్చే సత్తా కేసీఆర్లో ఉంది.
– జయరాంరెడ్డి, ర్యాలమడుగు, మెదక్ మండలం
సీఎం కేసీఆర్ గిరిజనుల పక్షపతి. గిజనులకు మేలు చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. గిరిజన తండాలను పంచాయతీలుగా చేయడమే కాకుండా రిజర్వేషన్ను పెంచిన ఘనత సీఎం కేసీఆర్దే. గిరిజనులంతా టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు మద్దతిస్తున్నారు. సీఎం కేసీఆర్తోనే దేశంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది.
– ధరావత్ సురేశ్ నాయక్, గిరిజన సంఘం నాయకుడు, రెడ్యానాయక్తండా(ధూళిమిట్ట)
జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రతిఒక్కరూ స్వాగతిస్తున్నారు. సీఎం కేసీఆర్ అంటే తెలంగాణ సాధకుడు మాత్రమే కాదు. ఎనిమిదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు. పేదలు, రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు. తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దే. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశానికి మంచి జరగడం ఖాయం.
– మోహన్నాయక్, మాల్కాపూర్ తండా, మెదక్