మెదక్/సంగారెడ్డి జిల్లాల నెట్ వర్క్ , అక్టోబర్ 5: తెలంగాణ ఉద్యమ పార్టీగా పురుడు పోసుకొని నేడు జాతీయ పార్టీగా అవతరించింది. బుధవారం విజయదశమి రోజున టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. బీఆర్ఎస్ ప్రకటనతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దేశ్కీ నేత కేసీఆర్.. జైబీఆర్ఎస్…జైజై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. ఊరువాడా, పల్లెపట్టణం అంతటా పార్టీ శ్రేణుల సంబురా లు అంబరాన్నంటాయి. స్వీట్లు పంచి, పటాకులు కాల్చి సంబురాల్లో మునిగి తేలారు. ప్రధాన కూడళ్లల్లో సీఎం కేసీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి క్షీరాభిషేకాలు చేశారు.